యాప్నగరం

కేసీఆర్, కేటీఆర్‌కు టీఆర్ఎస్ మాజీ ఎంపీ ఝలక్.. Hydలో పంచిన వరద సాయం అందుకా?

GHMC: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. శంషాబాద్, మణికొండ హైదరాబాద్‌లో భాగమేనా అని సూటిగా ప్రశ్నించారు. అక్కడా వానలు పడ్డాయని, ఆ కాలనీలు కూడా మునిగిపోయాయని గుర్తు చేశారు.

Samayam Telugu 17 Nov 2020, 8:19 pm
టీఆర్ఎస్ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ట్విటర్ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే దీపావళి సందర్భంగా ముస్లిం మహిళలు కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలుపుతున్న వీడియోను పోస్ట్ చేసి విమర్శించారు. ఉస్మాన్ నగర్‌లో గత రెండు నెలలుగా వర్షపు నీరు అలాగే నిలిచిందని, అయినా అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. స్లూయీస్ గేట్లు ఎత్తితే ఉస్మాన్ నగర్‌లో సమస్య పరిష్కరించేందుకు రెండే రెండు గంటలు సమయం పడుతుందని విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు.
Samayam Telugu కేటీఆర్, కేసీఆర్
KTR KCR


తాజాగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. శంషాబాద్, మణికొండ హైదరాబాద్‌లో భాగమేనా అని సూటిగా ప్రశ్నించారు. అక్కడా వానలు పడ్డాయని, ఆ కాలనీలు కూడా మునిగిపోయాయని గుర్తు చేశారు. అలాంటప్పుడు అక్కడ వరద సాయం ఎందుకు పంపిణీ చేయలేదని కొండా ప్రశ్నించారు. ఎందుకంటే అవి జీహెచ్ఎంసీ పరిధిలోకి రావని.. ఎంఐఎం బలం అక్కడ లేదని విమర్శించారు.

Also Read: undefined

‘‘శంషాబాద్, మణికొండ హైదరాబాద్‌లో బాగమేనా? శంషాబాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిపోర్టు ఉంది గుర్తు చేసుకోండి.. అక్కడా వరదలు వచ్చాయి. పేద ప్రజలు అక్కడా ఉన్నారు. అలాంటప్పుడు వరద సాయం అక్కడ ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్, కేటీఆర్? ఎందుకంటే అక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండవు. ఎంఐఎం ఉండదు.. అందుకేనా? అంటే వరద సాయం మీరిచ్చింది టీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తలను ఉత్సాహపర్చేందుకా?’’ అని ట్వీట్ చేశారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.