యాప్నగరం

కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం.. కేసీఆర్‌కు స్ఫూర్తి ఈ టీచరే..!

Jadcherla: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోయి తిరిగి క్లాసులకు హాజరు కాకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా బాలికలు ఉంటున్నారు.

Samayam Telugu 18 Jul 2020, 4:06 pm
మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలకు కూడా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విద్యాశాఖపై సమీక్షలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాలేజీల్లో మధ్యాహ్నం నుంచి క్లాసులను ఎగ్గొట్టడం, డ్రాపవుట్స్ తగ్గించేందుకు ఈ పథకం బాగా ఉపకరిస్తుందని కేసీఆర్ అధికారులతో అన్నారు. అంతేకాక, వారికి చక్కని పోషకాహారం కూడా అందుతుందని చెప్పారు.
Samayam Telugu కేసీఆర్
kcr on meet.


అయితే, ఓ అధ్యాపకుడు స్ఫూర్తిగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఆయన జడ్చర్ల ప్రభుత్వ కళాశాలలో పని చేసే రఘురాం. ఈయన రోజూ విద్యార్థులకు తన సొంత డబ్బుతో మధ్యాహ్న భోజనం పెడుతూ ఉంటారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి కేసీఆర్ దృష్టికి తేవడంతో గతంలో సీఎం లెక్చరర్ రఘురాంకు కూడా కాల్ చేసి ప్రశంసించారు. రఘురాం చేసిన వినతి మేరకు జడ్చర్ల జూనియర్ కాలేజీకి మరో కొత్త భవనాన్ని కూడా సీఎం మంజూరు చేశారు.

ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోయి తిరిగి క్లాసులకు హాజరు కాకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువగా బాలికలు ఉంటున్నారు. క్రమంగా డ్రాపవుట్స్ కూడా పెరుగుతున్నందున జడ్చర్ల జూనియర్ కాలేజీ తరహాలో రుచికరమైన మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని కాలేజీల్లోనూ అమలు చేస్తే బావుంటుందని అధికారులు భావించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.