యాప్నగరం

త్వరలో రంజాన్ మాసం.. కరోనా వేళ ముస్లింలకు జామియా ముఖ్య సూచనలు

Jamia Nizamia: రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, తారావీహ్ ప్రార్థనలు, ఖురాన్ పఠనం వంటివి పూర్తిగా ఇంట్లోనే జరగాలని వెల్లడించింది. ఇళ్ల వద్ద కూడా గుంపులుగా ఉండడం వంటివి చేయొద్దని చెప్పింది.

Samayam Telugu 16 Apr 2020, 11:25 pm
వచ్చే నెలలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు మసీదుల్లో నిర్వహించే తారావీహ్ ప్రార్థనలను తమ ఇళ్లలోనే చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన ఇస్లాం సంస్థ అయిన జామియా నిజామియా సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటన (ఫత్వా) జరీ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ అందరూ ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్, సహర్ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే ఎవరికి వారే నిర్వహించుకోవాలని సూచన చేసింది. ఈ విషయంలో ఎవరూ మసీదులకు వెళ్లరాదని ఆదేశించింది.
Samayam Telugu mecca-masjid


రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, తారావీహ్ ప్రార్థనలు, ఖురాన్ పఠనం వంటివి పూర్తిగా ఇంట్లోనే జరగాలని వెల్లడించింది. ఇళ్ల వద్ద కూడా గుంపులుగా ఉండడం వంటివి చేయొద్దని చెప్పింది. అంతేకాక, ఆసక్తి ఉన్నవారు రంజాన్ మాసంలో పేదలకు సాయం చేసి ఆదుకోవాలని జామియా నిజామియా కోరింది. లాక్ డౌన్ సమయంలో ఇది వారికి ఎంతో ఉపకరిస్తుందని సూచించింది.

Also Read: undefined

మరోవైపు, జామియా నిజామియా సంస్థ విడుదల చేసిన ప్రకటనను ఏంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. ఆ సంస్థ సూచించిన విధంగా ముస్లింలంతా పాటించాలని సూచించారు. ఈ సూచనలు కేవలం హైదరాబాద్, తెలంగాణ, ఏపీకి మాత్రమే పరిమితం కాదని.. భారత దేశం మొత్తం ఆచరించదగ్గవని ట్వీట్‌లో పేర్కొన్నారు. జామియా నిజామియా అనేది ఓ ఇస్లామిక్ యూనివర్సిటీ. ఇది హైదరాబాద్‌లో శతాబ్దాల కాలం నుంచి ఉన్న సంస్థ. దీన్ని 1876లో మహ్మద్ అన్వరుల్లా ఖాన్ ఫరూఖీ అనే వ్యక్తి స్థాపించారు.

Must Read: వామ్మో.. సామాజిక దూరం 2022 వరకూ తప్పదా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.