యాప్నగరం

Nagarjuna Sagar By Election: పోటీ చేసేది అతడే.. జానా రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఉప ఎన్నికలో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు జానారెడ్డి. అంతేకాదు రెండేళ్ల కోసం తాను ఎందుకు పోటీకి దిగుతానని ప్రశ్నించారు.

Samayam Telugu 10 Dec 2020, 12:36 pm
తెలంగాణలో త్వరలో మరో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో అన్నిపార్టీలు ఇప్పుడు ఆ ఎలక్షన్‌పై దృష్టి పెట్టాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. నోముల నర్సింహయ్య ప్రాతినిథ్యం వహించిన నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. రానున్న రెండు నెలల్లో అక్కడ బై ఎలక్షన్స్ నిర్వహించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Samayam Telugu కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి
jana reddy on nagarjuna sagar by elections


Read More: భార్య బెడ్ రూంలో ఉండగానే.. భర్త ఎంత పనిచేశాడంటే?

దీంతో ఇప్పుడు అందరి దృష్టి జానారెడ్డిపై పడింది. సుదీర్ఘకాలం పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు జానారెడ్డి.. ఎన్నో కీలక పదవులను అధిష్టించారు. గత ఎన్నికల్లో నోముల చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు నోముల మృతితో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి. దీంతో.. మరోసారి జానారెడ్డి పోటీ చేయడం ఖాయమని అంతా భావించారు. అయితే ఇలాంటి సమయంలో జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు జానారెడ్డి.

Read More: KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం... మోదీ అపాయింట్‌మెంట్ కోరిన కేసీఆర్

ఈసారి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని వెల్లడించారు. రెండేళ్ల కోసం తాను పోటీచేసి ఏం లాభం అని ప్రశ్నించారు జానారెడ్డి. ఎన్నికల్లో పోటీచేయనని గతంలోనే చెప్పానని.. రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా తన నిర్ణయం మారబోదన్నారు. ఇక, పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఆయన.. పార్టీని విడిచివెళ్లాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. మీడియా ఈ ప్రచారం చేస్తుందన్నారు. పీసీసీ ఎవరన్న నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందన్నారు. పార్టీ తన ఇష్ట ప్రకారం పీసీసీని నియమిస్తుందన్నారు. తన అభిప్రాయాన్ని ఠాకూర్‌కు చెప్పానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.