యాప్నగరం

Pawan Kalyan: యూరియా కోసం రైతు చనిపోవడం బాధాకరం

Siddipet జిల్లాలో యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి రైతు మరణించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Samayam Telugu 6 Sep 2019, 6:42 pm
తెలంగాణలో యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి రైతు చనిపోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పదవిలో ఉన్న వాళ్లు సరైన రీతిలో స్పందించాలని ఆయన సూచించారు. ఈ మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 6) ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఎంత మేరకు విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయో అంచనా వేసి డిమాండ్ తగినవిధంగా సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ గుర్తు చేశారు.
Samayam Telugu farmer death
పవన్ కళ్యాణ్


యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి మరణించిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. రైతులకు డిమాండ్‌కు తగినవిధంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. యూరియా కొరతపై యుద్ధప్రాదిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు.

Don't Miss: యాదాద్రి స్తంభాలపై సారు, కారు చిత్రాలు.. తెలంగాణలో దుమారం

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లిలో యూరియా కోసం క్యూలైన్లో నిలబడిన రైతు ఎల్లయ్య (69) గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. ఈ ఘటన తర్వాత యూరియా సరఫరా విషయంలో టీఆర్‌ఎస్ సర్కార్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు.

Also Read: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని దూరం చేసిన ఆరెస్సెస్!

యూరియా కోసం ఎల్లయ్య మూడు రోజులుగా క్యూలైన్లో నిల్చున్నారని స్థానిక రైతులు తెలిపారు. గురువారం ఉదయం 5 గంటలకే వచ్చి లైన్లో నిల్చున్నారని చెప్పారు. క్యూలైన్లో కుప్పకూలిన ఎల్లయ్యను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Must Read: యూరియా కోసం క్యూలైన్, రైతు మృతి.. మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.