యాప్నగరం

మున్సిపల్ ఎన్నికల వేళ అసదుద్దీన్ ఓవైసీకి షాక్

AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ప్రచారానికి వచ్చిన రోజే కరీంనగర్ పార్టీ అధ్యక్షుడు పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తీవ్ర ఆరోపణలు చేశారు.

Samayam Telugu 17 Jan 2020, 6:56 pm
జ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి కరీంనగర్‌లో షాక్ తగిలింది. జిల్లాలో ఆయన పర్యటస్తున్న రోజే.. పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వాహజ్ అహ్మద్ రాజీనామా చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ శుక్రవారం (జనవరి 17) కరీంనగర్ జిల్లాలో ప్రచారానికి వెళ్లారు. ఇదే సమయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాహజ్ అహ్మద్.. జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu asad in kmr


పార్టీలో క్రమశిక్షణ, గౌరవం లోపించాయని వాహజ్ అహ్మద్ ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆయన మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలే.. టికెట్ల పంపిణీ ఎలా జరిగిందో చెబుతాయని ఆయన అన్నారు.

మరోవైపు.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నిర్వహించిన సభలో అసద్‌ మాట్లాడుతూ.. ఎవరు డబ్బులిచ్చినా తీసుకోవాలని, ఎంఐఎంకు ఓటేయాలని చెప్పారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల్లో డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేలా అసద్ మాట్లాడారని తెలిపారు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తాయని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి గురువారం ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Also Read: భైంసాలో 70 మంది అరెస్టు.. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.