యాప్నగరం

తెలంగాణలో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్!

Jogulamba Gadwal: కరోనాబారిన పడిన జర్నలిస్ట్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందే జర్నలిస్టు సోదరుడికి కరోనా ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పనుల కోసం అతను కర్నూలుకు వెళ్లాడని.. ఆ తర్వాతే అతనికి కరోనా లక్షణాలు కనిపించినట్లుగా బంధువులు చెబుతున్నారు.

Samayam Telugu 24 Apr 2020, 9:14 pm
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులతోపాటు జర్నలిస్టులు సైతం తీవ్రంగా శ్రమిస్తు్న్నారు. క్షేత్రస్థాయిలో కరోనా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. ముంబయిలో ఇప్పటికే సుమారు 60 మంది, చెన్నైలోని ఒకే న్యూస్ ఛానెల్‌లో 27 మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఓ జర్నలిస్ట్‌కు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఈ విలేకరి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తి.
Samayam Telugu corona test


కరోనాబారిన పడిన జర్నలిస్ట్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందే జర్నలిస్టు సోదరుడికి కరోనా ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పనుల కోసం అతను కర్నూలుకు వెళ్లాడని.. ఆ తర్వాతే అతనికి కరోనా లక్షణాలు కనిపించినట్లుగా బంధువులు చెబుతున్నారు. ఇతని నుంచి జర్నలిస్టుకు కరోనా సోకినట్లుగా అధికారులు భావిస్తున్నారు. జర్నలిస్టు సోదరుడికి కరోనా ఉన్నట్లు తెలియగానే వెంటనే అధికారులు జర్నలిస్టును కూడా క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ ఉండగానే ఇతనికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.