యాప్నగరం

Justice For Preethi: జస్టిస్ ఫర్ ప్రీతి.. హోరెత్తిన సోషల్ మీడియా

Medical Student Preeti: సీనియర్ల వేధింపులకు బలైన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఆమె మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ ప్రీతి అనే హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 27 Feb 2023, 3:45 pm

ప్రధానాంశాలు:

  • ప్రీతి ఘటనపై భగ్గుమన్న నెటిజన్లు
  • జస్టిస్ ఫర్ ప్రీతి హ్యాష్‌టాగ్ ట్రెండిగ్
  • నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu justice for preethi
జస్టిస్ ఫర్ ప్రీతి
Medico Preeti: సీనియర్ల వేధింపులు తట్టుకోలేక వరంగల్ కేఎంసీలో బలవన్మరణానికి యత్నించి.. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన పీజీ మెడికో ప్రీతి ఓడిపోయింది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గత రాత్రి (ఆదివారం) ప్రాణాలు విడించింది. సీనియర్ విద్యార్థి సైఫ్, కాలేజీ హెచ్‌వోడీ నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇక ప్రీతి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రీతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ 'జస్టిస్ ఫర్ ప్రీతి' హ్యాష్‌టాగ్ వైరల్ వైరల్ అయింది. ప్రీతికి న్యాయం చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడయా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్ కేఎంసీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రీతిని వేధించిన నిందితుడు సైఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఉరి తీయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని స్టేషన్‌కు తరలించారు. ప్రీతి మృతి ఘటనపై ఓయూ జేఏసీ హెచ్‌ఆర్సీని ఆశ్రయించింది. ప్రీతిది హత్యా ? ఆత్మహత్యా ? అనే అంశంపై విచారణ జరపాలని హెచ్ఆర్సీసీని కోరారు. ప్రీతి మృతదేహానికి జూనియర్ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించాలన్నారు.

ప్రీతి ఘటనపై పొలిటికల్ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించాయి. సకాలంలో స్పందించి ఉంటే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడి ఉండేది కాదని ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. సీనియర్ విద్యార్థిపై కంప్లైంట్ చేయగానే అధికారులు స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించటంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ముగిసిన అంత్యక్రియలు..
ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా గిర్నితండాలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ఆశ్రునయనాల మధ్య ప్రీతికి బంధువులు, స్థానికులు కన్నీటీ వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో గ్రామస్తులు, స్థానికులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు భారీ భద్రత నడుమ ప్రీతి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామం తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.