యాప్నగరం

దిశ ఎన్‌కౌంటర్ బూటకం.. కావాలనే కాల్చి చంపారు: సిర్పూర్కర్ కమిషన్ రిపోర్టు

Disha Encounter Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని వీఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది. కావాలనే కాల్చి చంపారని పేర్కొంది. నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయాన్ని పోలీసులు దాచిపెట్టారని ఆక్షేపించింది.

Authored byRaj Kumar | Samayam Telugu 20 May 2022, 2:58 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకమని జస్టిస్‌ వీఎస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ తేల్చింది. ఇది కూడా మూకదాడి లాంటిదేనని అభిప్రాయపడింది. చట్టపరమైన పలు నిబంధనలు, రూల్స్ పోలీసులు అత్రికమించారని పేర్కొంది. దిశ నిందితులను చంపాలనే కాల్పులు జరిపినట్లు రిపోర్టులో వెల్లడించింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారంలో పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని కమిషన్‌ అభిప్రాయపడింది.

దిశ నిందితులే ముందుగా కాల్పులు జరిపారనడం అబద్ధమని కమిషన్ రిపోర్ట్ వెల్లడించింది. నిందితులు ఎదురు కాల్పుల్లో మరణించారన్న పోలీసుల వాదన నమ్మశక్యంగా లేదంది. ఈమేరకు సుప్రీంకోర్టు సమర్పించిన నివేదికలో జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ పేర్కొంది. అలాగే నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయాన్ని పోలీసులు దాచిపెట్టారని ఆక్షేపించింది.

Disha Case: దోషులు ఎవరో తేల్చాం.. కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నాం: దిశ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు
ఈ క్రమంలోనే పోలీసులు వి.సురేందర్, కె.నర్సింహారెడ్డి, షేక్ లాల్ మాదర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, కె.వెంకటేశ్వర్లు ఎస్.అర్వింద్ గౌడ్, డి.జానకీరామ్, ఆర్.బాలు రాథోడ్, డి.శ్రీకాంత్‌పై విచారణ జరపాలని కమిషన్‌ సూచించింది. ఈ పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ నివేదికలో పేర్కొంది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.