యాప్నగరం

జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రేటర్ ఎన్నికల వేళ అమెరికాలో ఉన్న కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

Samayam Telugu 30 Nov 2020, 1:38 pm
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ సికింద్రాబాద్‌లో జరుగుతున్న ఎన్నికల్లో మార్పు తేవాలి, మార్పు కావాలి అన్నారు పాల్. విలువైన ఓటును అమ్ముకోవద్దన్నారు. కులాలకు మతాలకు అతీతంగా ఓటు వేయాలని గ్రేటర్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. అతి త్వరలోనే హైదరాబాద్ వస్తున్నా అన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో గొప్ప మార్పు వస్తుందన్నారు.
Samayam Telugu ​కేఏ పాల్ ​
ka paul on ghmc elections


Read More: Badradri Temple: భద్రాద్రి రాముడి వద్దకు వింత పక్షి

మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డీఆర్‌సీ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సుల పంపిణీ పూర్తైందన్నారు. డీఆర్‌సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్‌ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ జరగనుంది. ఎల్బీనగర్‌ జోన్‌లో 5, చార్మినార్‌ జోన్‌లో 6 డీఆర్‌సీ కేంద్రాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలోని 30 డీఆర్‌సీ కేంద్రాల్లో పోలింగ్‌ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. పోలింగ్‌ సామాగ్రితో పాటు కరోనా కిట్లు, శానిటైజర్ల పంపిణీ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.