సమాజం రోజురోజుకి ఎంతో పురోగతిని సాధిస్తూ, మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఒకవైపు మానవ మృగాల రూపంలో కామాంధులు.. పసికందులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతుంటే మరోవైపు కొందరు దుర్మార్గులు వరకట్న వేధింపులతో మహిళ ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా అత్తింటి వేధింపులు భరించలేక మరో వివాహిత అర్ధంతరంగానే తనువు చాలించింది. పుట్టింట్లోనే శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని సజీవ దహనం అయింది. ఈ విషాదకర ఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బర్కత్పుర ప్రాంతానికి చెందిన వట్టిపల్లి ఎల్లయ్య - సత్తమ్మ దంపతుల చిన్న కుమార్తె గౌతమి(31)ని సికింద్రాబాద్ గ్యాస్మండి ప్రాంతానికి చెందిన కర్ర శ్రీశైలం, అరుణజ్యోతి దంపతుల కుమారుడు మధుకర్కు ఇచ్చి 2018 జూలైలో వివాహం జరిపించారు. మధుకర్ ఓ కొరియర్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. గౌతమి ఏపీఎస్సీఆర్ఐసీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. పెళ్లి సమయంలో గౌతమి తల్లిదండ్రులు రూ. 15 లక్షల కట్నం ఇచ్చి, రూ. 5 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించారు.
అయితే పెళ్లైన కొద్ది రోజులకే అత్త అరుణజ్యోతి, ఆడపడుచులు శిరీష, లత, స్వప్న, భర్త మధుకర్ గౌతమిని తరచూ వేధిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో గత జూలైలో బోనాల పండగ సందర్భంగా పుట్టింటికి వెళ్లిన గౌతమి తిరిగి అత్తగారింటికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఇటీవల గౌతమి భర్త, అత్త.. ఎల్లయ్య ఇంటికి వచ్చి గౌతమిని దుర్భాషలాడి, మందలించారు. దీంతో గౌతమి తీవ్ర మనస్తాపానికి గురైంది.
మంగళవారం ఉదయం తల్లి సత్తమ్మ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటిపైన కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. కిటికీ నుంచి పొగరావడం, ఆమె కేకలు వేయడంతో స్థానికి యువకులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే పూర్తిగా కాలిపోయిన గౌతమి మరణించింది.
సమాచారం అందుకున్న కాచిగూడ ఏసీపీ సుధాకర్, సీఐ హబీబుల్లాఖాన్, డీఐ యాదేందర్, అడ్మిన్ ఎస్ఐ లక్ష్మయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గౌతమి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్త, ముగ్గురు ఆడపడుచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బర్కత్పుర ప్రాంతానికి చెందిన వట్టిపల్లి ఎల్లయ్య - సత్తమ్మ దంపతుల చిన్న కుమార్తె గౌతమి(31)ని సికింద్రాబాద్ గ్యాస్మండి ప్రాంతానికి చెందిన కర్ర శ్రీశైలం, అరుణజ్యోతి దంపతుల కుమారుడు మధుకర్కు ఇచ్చి 2018 జూలైలో వివాహం జరిపించారు. మధుకర్ ఓ కొరియర్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. గౌతమి ఏపీఎస్సీఆర్ఐసీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. పెళ్లి సమయంలో గౌతమి తల్లిదండ్రులు రూ. 15 లక్షల కట్నం ఇచ్చి, రూ. 5 లక్షలు ఖర్చు చేసి ఘనంగా వివాహం జరిపించారు.
అయితే పెళ్లైన కొద్ది రోజులకే అత్త అరుణజ్యోతి, ఆడపడుచులు శిరీష, లత, స్వప్న, భర్త మధుకర్ గౌతమిని తరచూ వేధిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో గత జూలైలో బోనాల పండగ సందర్భంగా పుట్టింటికి వెళ్లిన గౌతమి తిరిగి అత్తగారింటికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఇటీవల గౌతమి భర్త, అత్త.. ఎల్లయ్య ఇంటికి వచ్చి గౌతమిని దుర్భాషలాడి, మందలించారు. దీంతో గౌతమి తీవ్ర మనస్తాపానికి గురైంది.
మంగళవారం ఉదయం తల్లి సత్తమ్మ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటిపైన కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. కిటికీ నుంచి పొగరావడం, ఆమె కేకలు వేయడంతో స్థానికి యువకులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే పూర్తిగా కాలిపోయిన గౌతమి మరణించింది.
సమాచారం అందుకున్న కాచిగూడ ఏసీపీ సుధాకర్, సీఐ హబీబుల్లాఖాన్, డీఐ యాదేందర్, అడ్మిన్ ఎస్ఐ లక్ష్మయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గౌతమి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్త, ముగ్గురు ఆడపడుచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.