యాప్నగరం

కవిత గొప్ప మనసు.. యువ ఇంజినీర్‌కు సాయం

వినయ్ బీటెక్ పూర్తి చేశాడు. అయితే స్వగ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్పట్నుంచి వినయ్ వీల్ చైర్‌కే పరిమితం అయ్యాడు.

Samayam Telugu 30 Aug 2020, 7:24 am
మాజీ ఎంపీ కవిత తనకున్న పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరిన యువకుడ్ని ఆదుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు వినయ్‌కి అపన్నహస్తం అందించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. బీటెక్‌ పూర్తి చేసిన వినయ్‌కి శనివారం ఆమె మూడు చక్రాల స్కూటీని అందజేశారు. వినయ్‌ ఆరోగ్య పరిస్ధితి గురించి తెలుసుకున్న మాజీ ఎంపీ కవిత అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Samayam Telugu మాజీ ఎంపీ కవిత
kavitha


ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్‌లో కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీని అందించి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా వినయ్ కుటుంబ సభ్యులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వినయ్ గత ఆరేళ్లుగా వీల్ చైర్‌కు పరిమితం అయ్యాడు. కోరుట్ల పట్టణానికి చెందిన బోగ వినయ్ 2014లో హైదరాబాద్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. స్వగ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించగా రూ.18 లక్షల వరకు ఖర్చుకాగా అప్పటినుండి ఇంటికే పరిమితమయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.