యాప్నగరం

మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి.. మంత్రుల సంతాపం

Kalvakurthy: కిష్టారెడ్డి మృతి ప‌ట్ల పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Samayam Telugu 18 Aug 2020, 3:25 pm
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఆ తర్వాత వైసీపీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు.
Samayam Telugu మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి
yedma kistareddy


కిష్టారెడ్డి మృతి ప‌ట్ల పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కిష్టారెడ్డికి సంతాపం ప్రకటించిన వారిలో సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్ రావు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ఎడ్మ కిష్టారెడ్డి గారు గ్రామ సర్పంచిగా, శాసన సభ్యుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశారని వారు గుర్తు చేసుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఎడ్మ కిష్టారెడ్డి గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పాల్గొనాలని కేసీఆర్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.