యాప్నగరం

టీకాంగ్రెస్ యువనేతకి భారీ ప్రమోషన్.. నేషనల్ టీంలో.. కీలక బాధ్యతలు

టీకాంగ్రెస్ యువనేతకి కీలక బాధ్యతలు అప్పగిస్తూ అధినేత్రి సోనియా గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శికి సహాయకుడిగా ఆయన్ను నియమించారు.

Samayam Telugu 26 Oct 2021, 8:59 pm
తెలంగాణ కాంగ్రెస్ యువనేతకి భారీ ప్రమోషన్ దక్కింది. ఏఐసీసీ కార్యకర్త, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న వంశీచంద్ రెడ్డికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కి సహాయకుడిగా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీచంద్ రెడ్డి 2014లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vamshi chand reddy


ఆయన గతంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగ నాయకుడిగా.. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచే అధిష్టానం వద్ద గుర్తింపు పొందిన వంశీచంద్ తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శి సహాయకుడిగా నియమితులయ్యారు. తనకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించినందుకు వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీకి అభినందనలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సమర్థంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.