యాప్నగరం

కామారెడ్డి సీఐ అరెస్టు.. ఐపీఎల్ బెట్టింగ్ కేసులో భారీ లంచం డిమాండ్

Kamareddy: కామారెడ్డికి చెందిన బత్తుల సుధాకర్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఈ నెల 8న అరెస్ట్ అయ్యాడు. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్ నిందితుడి నుంచి రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.

Samayam Telugu 21 Nov 2020, 11:08 am
కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినందుకు ఆయన అరెస్టు అయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జగదీశ్ ఆఫీసుతో పాటు ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వద్ద కీలక పత్రాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu కామారెడ్డి సీఐ అరెస్టు
kamareddy ipl betting case


కామారెడ్డికి చెందిన బత్తుల సుధాకర్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఈ నెల 8న అరెస్ట్ అయ్యాడు. అతనికి బెయిల్ ఇచ్చేందుకు కామారెడ్డి టౌన్ సీఐ జగదీశ్ నిందితుడి నుంచి రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. మొదటి వాయిదాగా రూ.1.39 లక్షలు తీసుకొన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన 8వ తేదీనే జగదీశ్‌ను విడుదల చేశారు. మిగిలిన నగదు కోసం సీఐ వేధించారు. దీంతో సుధాకర్ ఈ నెల 19న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సీఐ జగదీష్‌తో పాటు ఈ వ్యవహారంలో సహకరించిన సృజయ్ కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 12 గంటల పాటు సీఐ ఇంట్లో సోదాలు జరిపి, కీలక ఆధారాలు, లాకర్ కీ లు స్వాధీనం చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.