యాప్నగరం

కన్నా కోడలి మరణం.. కొత్త ట్విస్టులు తెర మీదకు.. రంగంలోకి సజ్జనార్!?

కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణంపై ఆమె భర్త ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తన భార్య మరణించిన సమయంలో ఆమెతోపాటు ఉన్న వారందర్నీ మళ్లీ విచారించాలని కోరారు.

Samayam Telugu 25 Jul 2020, 4:37 pm
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక ఈ ఏడాది మే 29న హైదరాబాద్‌లో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఆమె ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆమె మరణంపై అనుమానాలు తలెత్తినా.. చివరకు కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆమె చనిపోయిందని తేలింది. కాగా సుహారిక చనిపోయి దాదాపు రెండు నెలలు గడుస్తోన్న వేళ.. తన భార్య మరణంపై కన్నా ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు.
Samayam Telugu ఫైల్ ఫొటో


సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసిన కన్నా ఫణీంద్ర.. తన భార్య మరణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. కేసు విచారణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సజ్జనార్‌ను కోరారు. సీబీఐటీ సమీపంలో ఉన్న ఫామ్ హౌస్‌లోనే సుహారిక మరణించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని దాచిపెట్టి.. ఏఐజీ హాస్పిటల్‌కు చేరువలో ఉన్న మీనాక్షి బాంబూస్‌లో జరిగిందని చెబుతున్నారని ఫణీంద్ర అనుమానం వ్యక్తం చేశారు.

మెడికో లీగల్ రిపోర్ట్ ప్రకారం తన భార్య 11.30 గంటల సమయంలోనే అచేతనంగా మారిందని... 12.45 గంటల సమయంలో హాస్పిటల్‌కు తీసుకొచ్చారని ఫణీంద్ర చెప్పారు. ఈ విషయాన్ని 1.13 గంటల సమయంలో తనకు చెప్పారన్నారు. సుహారిక చనిపోయిన సమయంలో ఉన్న ప్రవీణ్, వివేక్, వివాస్, పవన్‌ నిజాలు దాచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సుహారిక తల్లి కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం సందేహాస్పదంగా ఉందన్నారు. దీంతో వారందర్నీ మళ్లీ విచారించాలని సజ్జనార్‌ను కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.