యాప్నగరం

కరోనా భయంతో జనం దూరం.. మృతుడి అంత్యక్రియల్లో కార్పొరేటర్

Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్‌లో 38వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ కచ్చు రవి ఈ విషయంలో మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి ఆయన అంతక్రియలు నిర్వహించారు.

Samayam Telugu 21 Jul 2020, 6:26 pm
కరోనాతో చనిపోతున్న నిర్భాగ్యులకు అంత్యక్రియల సమయంలో అయిన వారు సైతం దూరమవుతున్న ఘటనలు తరచూ చూస్తున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక జబ్బులు లేదా ఇతర అనారోగ్యాలతో చనిపోయినా కరోనాతో చనిపోయారనే అనుమానంతో ఆఖరి క్రతువుకు ఎవరూ హాజరుకావడం లేదు. అయినా వారు సైతం రాని ఈ పరిస్థితుల్లో తమకేమీ సంబంధం లేదని కొంత మంది మానవత్వం ఉన్నవారు మాత్రం అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన కరీంనగర్‌లో జరిగింది.
Samayam Telugu అంత్యక్రియల్లో బీజేపీ కార్పొరేటర్
Karimnagar corporator helps


కరీంనగర్ కార్పొరేషన్‌లో 38వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ కచ్చు రవి ఈ విషయంలో మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి ఆయన అంతక్రియలు నిర్వహించారు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నా, వారికి సాయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని కురుమవాడకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో చనిపోయాడు. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఏదో అనారోగ్యంతో మరణించడంతో ఇతను కూడా కరోనాతోనే మరణించాడనుకొని బంధువులెవరూ ముందుకు రాలేదు.

దీంతో దు:ఖంలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్ రవి అండగా నిలిచారు. మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి దహన సంస్కారాలు నిర్వహించడంలో సాయం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.