యాప్నగరం

అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయండి.. కరీంనగర్ కోర్టు ఆదేశం..

Karimnagar court | ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల కరీంనగర్‌లో పార్టీ సమావేశంలో చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయంటూ వీడియో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.

Samayam Telugu 1 Aug 2019, 12:40 pm
క వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా కోర్టు బుధవారం (జులై 31) పోలీసులను ఆదేశించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ బీజేపీ నేత బేతి మహేందర్ రెడ్డి సాక్ష్యాధారాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఐపీసీ సెక్షన్ 153ఏ, 153బి, 506ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని పట్టణ పోలీసులకు సూచించింది.
Samayam Telugu akbaruddin-owaisi


కరీంనగర్‌లో గత నెల 24న స్థానికంగా నిర్వహించిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా అక్బరుద్దీన్ చేసిన ప్రసంగిస్తూ కరీంనగర్‌లో బీజేపీ గెలవడం తనను చాలా ఆవేదనకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.

Read aslo: చనిపోతాననే బాధ కంటే అదే నన్ను వేధిస్తోంది.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

‘నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు. మరణం విషయంలో నాకు బాధలేదు. నేను భయపడేది నా గురించి కాదు. రాబోయే తరాల గురించే నా భయం. కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీకి అడ్రస్‌ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్‌ ఎంపీ స్థానాన్నే గెలుచుకుంది. మజ్లిస్‌ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. ఎంఐఎం గెలవకపోయినా ఫర్వాలేదు. బీజేపీని గెలిపించొద్దు’అని అక్బరుద్దీన్ పిలుపునిచ్చారు.

‘15 నిమిషాలు వదిలిపెట్టండి. హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తా’ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను అక్బర్ మళ్లీ ఉటంకించారు. దీంతో స్థానిక బీజేపీ నేతులు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు న్యాయ నిపుణుల సలహాతో అక్బరుద్దీన్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు.

Read aslo: అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయలేం: కరీంనగర్ పోలీసులు

తాజాగా కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వీడియో సాక్ష్యాలు సమర్పించడంతో కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.