యాప్నగరం

ఇద్దరు ప్రియుళ్లతో భర్తను చంపే స్కెచ్.. కరీంనగర్‌లో వివాహిత దారుణం

కరీంనగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చడానికి ప్రణాళిక రచించింది. చివరి నిమిషంలో వారి నుంచి తప్పించుకున్న భర్త.. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 23 Dec 2019, 9:18 pm
కరీంనగర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ కట్టుకున్న భర్తను కడతేర్చడానికి ప్రణాళిక రచించింది. చివరి నిమిషంలో వారి నుంచి తప్పించుకున్న భర్త.. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu karimnagar woman tries to kill husband with her two boyfriends over illegal affair
ఇద్దరు ప్రియుళ్లతో భర్తను చంపే స్కెచ్.. కరీంనగర్‌లో వివాహిత దారుణం


ఇంట్లో ఒంటరిగా ఉండటంతో..

కావేరి అనే మహిళకు కృష్ణవంశీతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరిద్దరూ కరీంనగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణవంశీ ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత కావేరి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సమాన్విత్, గణేశ్ అనే యువకులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది.

రెండేళ్లుగా ఇంట్లోనే రాసలీలలు..

భర్తకు తెలియకుండా వివాహిత రెండేళ్లుగా తన ఇద్దరు ప్రియుళ్లతో రాసలీలు సాగిస్తోంది. సొంత ఇంట్లోనే రెచ్చిపోయింది. ఈ విషయం కాస్త కృష్ణవంశీకి తెలియడంతో అతడు తన భార్యను నిలదీశాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అప్పటికీ ఆమె తన తీరు మార్చుకోకపోగా.. ప్రియుళ్లతో కలిసి దారుణ నిర్ణయం తీసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయడానికి ప్లాన్ వేసింది.

ప్లాన్ వికటించిందిలా..

ముందస్తు ప్రణాళిక ప్రకారం.. డిసెంబర్ 14న ఉదయం సదరు మహిళ తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి వంశీకృష్ణ చంపడానికి ప్రయత్నం చేసింది. గాఢ నిద్రలో ఉన్న భర్తను ఊపిరాడకుండా చేసి చంపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ, వంశీకృష్ణ చివరి నిమిషంలో తప్పించుకొని పారిపోయాడు.

డయల్ 100కు కాల్ చేయడంతో..

భార్య బారి నుంచి తప్పించుకున్న కృష్ణవంశీ 100 నంబర్ డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే.. ఆ యువకులిద్దరూ అప్పటికే పారిపోయారు. ఎట్టకేళలకు పోలీసులకు చిక్కారు. విచారణలో వాస్తవాలన్నీ వెల్లడించారు.

యువకుల బారిన మరి కొందరు మహిళలు..?

అమ్మాయిలు, మహిళలను ట్రాప్ చేసి.. వారితో ఫోటోలు దిగి, బెదిరింపులకు పాల్పడుతూ లైంగికంగా లొంగదీసుకోవడం సమాన్విత్‌కు వెన్నతో పెట్టిన విద్యగా భావిస్తున్నారు. పలువురు మహిళలు, యువతులు అతడి బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించారు. సెల్‌ఫోన్‌లో పలువురు మహిళతో అసభ్యంగా దిగిన ఫోటోలను గుర్తించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


Also Read: శివార్లలో శవమై తేలిన యువతి.. కామారెడ్డిలో కలకలం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.