యాప్నగరం

కేరళ జలపాతంలో తెలంగాణ విద్యార్థి మృతి

కేరళలో విహారయాత్రకు వెళ్లి తెలంగాణకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కరీంనగర్‌కు చెందిన శ్రీహర్ష ప్రమాదవశాత్తూ జలపాతంలో జారిపడి మృతి చెందాడు.

Samayam Telugu 16 Dec 2019, 3:32 pm
కేరళలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. కరీంనగర్‌కు చెందిన శ్రీహర్ష అనే యువకుడు విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మృత్యువాతపడ్డాడు. అతడి మృతదేహాన్ని జాలర్లు బయటకు తీసుకొచ్చారు. కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీహర్ష ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత శుక్రవారం (డిసెంబర్ 13) కాలేజీకి చెందిన 60 మంది విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.
Samayam Telugu Sriharsha


కొట్టాయంలోని మర్రి మాల్ జలపాతం వద్ద శ్రీహర్ష సరదాగా గడుపుతూ.. ప్రమాదవశాత్తూ ప్రవాహంలో జారీ పడ్డాడు. కాలేజీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. శ్రీహర్ష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: దిశ నిందితుల మృతదేహాలకు ఎంబాల్మింగ్, ఇంజెక్షన్లు.. ఖర్చు భారమే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.