యాప్నగరం

ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కవిత

కవిత గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చి కవితకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అందరికీ ధన్యవాదాలు తెలిపారు కవిత.

Samayam Telugu 12 Oct 2020, 1:12 pm
తన గెలుపునకు సహకరించిన అందరికి ధన్యవాదములు తెలిపారు కల్వకుంట్ల కవిత. ప్రతీ ఒకర తన గెలుపు కోసం కష్టపడ్డారన్నారు.
Samayam Telugu ఉప ఎన్నికలో కవిత గెలుపు
kavitha victory

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తనకు సహకరించి, గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్ఎస్ కార్యకర్తలకు కవిత ధన్యవాదాలు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మాట్లాడారు. కవితను భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కవిత 728 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల నుంచి 192 ఓట్లు వచ్చాయి. అబద్ధపు మాటలు చెప్పి డూప్లికేట్ బాండు పేపర్లలో బీజేపీ నేతలు మోసం చేశారన్నారు. వారి అబద్దాలకు జవాబుగా కవితకు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. పార్టీ తరఫున అందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు మంత్రి వేముల. న్యాయం మరోసారి గెలించిందన్నారు. కాంగ్రెస్ , బీజేపీల ఓట్లు కలిపినా డిపాజిట్ కూడా దక్కలేదని విమర్శించారు.

Read More:తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

మొత్తం 823 ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లలేదు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 39, కాంగ్రెస్ 22 ఓట్లు పోలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.