G20 Presidency: తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటించారు. అప్పటినుంచి కేసీఆర్ ఎక్కడ మాట్లాడినా.. దేశ ప్రగతిలో తాము కీలక పాత్ర పోషిస్తామని.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామని చెబుతున్నారు. భవిష్యత్తులో దేశంలో బీఆర్ఎస్ (BRS) పాత్ర ఎంతో కీలకమని వివరిస్తున్నారు. తాజాగా మహబూబ్నగర్లోనూ కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించి.. దేశ రాజకీయాలకు వెళ్దామని పిలుపునిచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే.. ప్రధాని మోదీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశం జరిగింది. ఈ జీ-20 సన్నాహక సమావేశానికి రావాలని దేశంలోని అన్ని పార్టీల అధినేతలను భారత ప్రభుత్వం కోరింది. కాంగ్రెస్ పార్టీ సహా.. మమతాబెనర్జీ వరకు అందరూ ఈ సమావేశానికి హాజరై.. తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ.. తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ (KCR) మాత్రం.. దీనికి హాజరవ్వలేదు. దీంతో భారతీయ జనతా పార్టీకి మరో ఆయుధం దొరికినట్టు అయ్యింది. జీ-20 సన్నాహక సమావేశంలో.. 'దేశ్ కీ నేత' ఎక్కడ ఉన్నారో కనిపెట్టండి అంటూ.. బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ సమావేశానికి పక్కనున్న ఏపీకి చెందిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. వారివారి అభిప్రాయాలు చెప్పారు. కానీ.. కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. జీ-20 అధ్యక్ష పదవిని భారత్ (India) చేపట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మనవైపే చూస్తుందని.. అందువల్ల పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమని.. వాటిని మనవరకే పరిమితం చేసుకుని సదస్సు విజయవంతానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన.. సోమవారం ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం జరిగింది. జీ-20 దేశాధినేతల ప్రతిష్ఠాత్మక సదస్సుకు భారత్ వేదిక అయ్యింది. దీంతో వివిధ పార్టీల అధినేతలు ప్రధాని మోదీకి అభినందనలు చెప్పారు. జీ-20 సదస్సు ఏర్పాట్లు.. అందుకు సంబంధించిన సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు నేతలు స్పష్టం చేశారు. సదస్సు విజయవంతమయ్యేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దీంతో సమావేశం సందడిగా సాగింది.
ఇలాంటి కీలక సమావేశానికి కూడా కేసీఆర్ (KCR) వెళ్లకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతాబెనర్జీ వెళ్లినప్పుడు.. కేసీఆర్ వెళ్లకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలు పక్కనబెట్టి.. ఇలాంటి సందర్భంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More Telangana News And Telugu News
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన.. సోమవారం ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం జరిగింది. జీ-20 దేశాధినేతల ప్రతిష్ఠాత్మక సదస్సుకు భారత్ వేదిక అయ్యింది. దీంతో వివిధ పార్టీల అధినేతలు ప్రధాని మోదీకి అభినందనలు చెప్పారు. జీ-20 సదస్సు ఏర్పాట్లు.. అందుకు సంబంధించిన సన్నాహకాల్లో ఎలాంటి బాధ్యతను అప్పగించినా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు నేతలు స్పష్టం చేశారు. సదస్సు విజయవంతమయ్యేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దీంతో సమావేశం సందడిగా సాగింది.
ఇలాంటి కీలక సమావేశానికి కూడా కేసీఆర్ (KCR) వెళ్లకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే మమతాబెనర్జీ వెళ్లినప్పుడు.. కేసీఆర్ వెళ్లకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలు పక్కనబెట్టి.. ఇలాంటి సందర్భంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More Telangana News And Telugu News