యాప్నగరం

వారణాసిలో కేసీఆర్ ఫ్యామిలీ: గంగాహారతి, ప్రత్యేక పూజలు.. వాళ్లతో కవిత ముచ్చట

Varanasi: దశాశ్వమేధ ఘాట్‌లో స్థానిక బెనారస్ ప్రజలతో కవిత సంభాషించారు. దశాశ్వమేధ ఘాట్‌లో పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.

Samayam Telugu 28 Jan 2021, 9:54 pm

ప్రధానాంశాలు:

  • దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతి
  • ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో పూజలు
  • దశాశ్వమేధ ఘాట్‌లో స్థానిక బెనారస్ ప్రజలతో కవిత ముచ్చట
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu గంగా హారతి
kcr family in varanasi
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ సతీమణి‌ శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిని సందర్శించారు. గురువారం పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గంగా హారతి కూడా నిర్వహించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత, శోభ, ఇతర కుటుంబ సభ్యులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారణాసికి బయలుదేరారు. వారణాసిలో ముందుగా అస్సి ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు పడవలో ప్రయాణిస్తూ, బోటు నడిపే వారితో ఎమ్మెల్సీ కవిత కాసేపు ముచ్చటించారు. దశాశ్వమేధ ఘాట్‌లో గంగా నదికి హారతి ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత, గంగా పూజ నిర్వహించారు.
దశాశ్వమేధ ఘాట్‌లో స్థానిక బెనారస్ ప్రజలతో కవిత సంభాషించారు. దశాశ్వమేధ ఘాట్‌లో పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం బోట్‌లో‌ అస్సీ ఘాట్‌కు బోట్‌లో‌ తిరుగు ప్రయాణమయ్యారు.

సాయంత్రం ప్రాచీన సంకట్ మోచన్ మందిరాన్ని దర్శించుకొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంత్ తులసీదాస్ నిర్మించిన సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు, రామభక్తుడైన హనుమంతుడు ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రధాన పూజారి మహంత్ డా.విశ్వంభర నాథ్ మిశ్రా, ఎమ్మెల్సీ కవిత, శోభతో ప్రత్యేక పూజలు చేయించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ ‌కవిత భగవంతుని ప్రార్థించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.