యాప్నగరం

వ్యూహం మార్చిన కేసీఆర్.. బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేందుకు కొత్త స్కెచ్!

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం మార్చారు. బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. జనామోదంతోపాటు నాయకులు చేజారకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Samayam Telugu 28 Dec 2020, 11:36 am
దుబ్బాక ఉపఎన్నికలో ఓటమిని లైట్ తీసుకున్న టీఆర్ఎస్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరును మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో సీట్లు సాధించిన బీజేపీ.. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చాటి చెప్పింది. ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలనుకోవడం.. ఏకపక్ష నిర్ణయాల కారణంగా కేసీఆర్‌ ఈ స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే తరహాలో ముందుకెళ్తే.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని కేసీఆర్ భావించారు.
Samayam Telugu TRS chief KCR
Telangana CM KCR


అందుకే మెల్లగా దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన నియంత్రిత పంటల సాగు విధానం రైతులకు ప్రయోజనం చేకూర్చకపోగా.. నష్టాలను తీసుకొచ్చింది. చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు ఇస్తామని ప్రకటించడం కూడా రైతుల ఆగ్రహానికి కారణమైంది. ఈ ప్రయోగం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ వెనక్కి తగ్గారు. నియంత్రిత పంటలసాగును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణలో తొలిసారిగా మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి చైర్ పర్సన్‌గా మహిళా కమిషన్‌ను నియమించారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మహిళా కమిషన్ ఏర్పాటుపై సర్కారు దృష్టి సారించకపోవడం పట్ల విమర్శలొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం వాటిని లైట్ తీసుకున్నారు. కానీ బీజేపీ దూకుడు పెంచుతున్న వేళ.. నేతలు చేజారకుండా కేసీఆర్ సర్కారు నామినేటెడ్ పదవులను కట్టబెట్టే వ్యూహాన్ని అమలు చేస్తుందని భావిస్తున్నారు. అటు ప్రజాగ్రహాన్ని చల్లార్చడం.. ఇటు నేతలు చేజారకుండా చూడటం అనే వ్యూహంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.