యాప్నగరం

కేసీఆర్ ఛైర్మన్‌గా నూతన మండలి ఏర్పాటు.. ఎందుకంటే..

Telangana Government ఏర్పాటు చేసిన ఈ మండలిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు మాత్రమే కాకుండా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తదితరులు ఉండనున్నారు.

Samayam Telugu 18 Dec 2019, 8:54 pm
అటవీ ప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వన్య ప్రాణి మండలిని ఆయన ఏర్పాటు చేశారు. ఈ మండలికి ఛైర్మన్‌గా కేసీఆర్ వ్యవహరించనున్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వైస్ ఛైర్మన్‌గా ఉంటారు. దీనికి సంబంధించి తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Samayam Telugu KCR wildlife


Must Read: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తలకు కొమ్ములు..!

ఈ మండలిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లు మాత్రమే కాకుండా ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, కుమ్రం భీం అసిఫాబాద్ జడ్పీ ఛైర్‌ పర్సన్ కోవా లక్ష్మి, ఎన్జీవోల తరపున ప్రతినిధులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరంతా 3 సంవత్సరాల పాటు వన్యప్రాణి మండలి సభ్యులుగా కొనసాగుతారు. ఈ వన్యప్రాణి మండలి ఏటా రెండు సార్లు సమావేశం కానుంది.

Must Read: యాదాద్రి పునర్నిర్మాణం పూర్తయితే.. ఆలయం ఇలా..

మరోవైపు, వన్య ప్రాణి సంరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై జంతు ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వన్యప్రాణి మండలి చేపట్టే విధులు, అధికారాల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Must Read: భారీ ఎత్తున పెరగనున్న భూముల ధరలు..! ఎందుకంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.