యాప్నగరం

కేసీఆర్ కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్.. ఈటలపై వేటు తప్పదా?

Telangana క్యాబినెట్‌లో మరో ఆరుగురికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇద్దరికి ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఈటలతో పాటు మరో మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Samayam Telugu 8 Sep 2019, 12:01 am
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆదివారం (సెప్టెంబర్ 8) సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్‌ భవన్‌లో ఇందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్‌గా నియామకమైన తమిళసై సౌందరరాజన్‌కు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం ఆమె గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Samayam Telugu Etela


తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎం కేసీఆర్‌తో పాటు 12 మంది ఉండగా.. ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం ఉన్న మంత్రల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈటలతో పాటు మంత్రి మల్లారెడ్డిపై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ ఉద్యమం నాటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న ఈటల రాజేందర్‌కు అటు టీఆర్‌ఎస్ పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ కేసీఆర్ సముచిత గౌరవం కల్పించారు. అయితే.. ఇటీవల ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈటల తన శాఖకు సంబంధించిన కొన్ని రహస్యాలను బయటకు పొక్కేలా చేశారని.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని ఆ వార్తల సారాంశం.

Don't Miss: అడుక్కుంటే వచ్చిన పదవి కాదు.. మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

తనను మంత్రి పదవిని తప్పిస్తారనే అంశంపై అటు ఈటల కూడా స్పందించారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినోన్ని కాదని.. బతికొచ్చినోన్ని కాదని స్పష్టం చేశారు. తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్లం కాదన్నారు. అధికారం శాశ్వతం కాదని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందన్నారు. ఈటలకు పలువురు నేతలు అండగా నిలిచారు.

Also Read: కేటీఆర్‌కు బెర్త్ ఖరారు.. మరి హరీశ్ మాటేమిటి?

మంత్రివర్గం నుంచి ఈటలను తప్పిస్తే అది సంచలన నిర్ణయమే అవుతుందని.. అలాంటి సంచలనాలు కేసీఆర్‌కు కొత్తేమీ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. కేబినెట్‌ నుంచి ఈటలను తప్పించకపోవచ్చని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read: రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని దూరం చేసిన ఆరెస్సెస్!

ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డిపై వేటు తప్పదని ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో ఇటీవల ఎమ్మెల్సీగా గెలుపొందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఆరు స్థానాలను ఒకే దఫాలో భర్తీ చేస్తారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

కార్పొరేషన్‌ పదవుల భర్తీకి రంగం సిద్ధం
అన్ని రకాల పదవులను పూర్తిగా భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కార్పొరేషన్‌ పదవులను కూడా త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో చోటు దక్కనివారికి నామినేటెడ్‌ పదవులు దక్కే అవకాశం ఉంది. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Must Read: హైదరాబాద్‌లో మరో లవ్ జిహాద్ కేసు.. సర్వత్రా ఆందోళన

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, నాయిని నర్సింహరెడ్డికి ఉన్నత పదవులు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కొందరికి రాజ్యసభ, మరికొందరికి ఆర్టీసీ, రైతు సమన్వయ సమితి పదవులు దక్కే ఛాన్స్ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.