యాప్నగరం

కీసర ఎమ్మార్వో కేసు.. మరో ఆత్మహత్య

కోటిరూపాయల లంచం కేసులో ధర్మారెడ్డితో చేతులు కలిపి ఫోర్జారీ డాక్యుమెంట్స్ పై సంతకాలు చేసినట్టు మాజీ ఎమ్మార్వో నాగరాజు పై ఆరోపణలుఉన్నాయ. పదిరోజుల క్రితమే ఈ కేసులో ధర్మారెడ్డి బెయిల్ పై బయటకు వచ్చారు.

Samayam Telugu 8 Nov 2020, 10:06 am
కీసర తహశీల్దార్ ఎమ్మార్వో నాగరాజు లంచం కేసులో మరో ఆత్మహత్య ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భూమి అక్రమ మ్యుటేషన్ ఆరోపణతో ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 33 రోజులుగా జైలులో ఉన్న ధర్మారెడ్డి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన మానసికవేదనతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కుషాయిగూడ వాసవి శివ నగర్ లో శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకన్నారు.
Samayam Telugu కీసర ఎమ్మార్వో కేసు ధర్మారెడ్డి ఆత్మహత్య
keesara mro case dharma reddy suicide


ఒరిజినల్ ఓనర్ లు కాకపోయినా తమ బంధువుల పేర్లమీద పట్టా పాస్ బుక్కులు మాజీ ఎమ్మార్వో నాగరాజు సహాయంతో చేయించుకున్నట్టు ధర్మారెడ్డిపై ఏసీబి ఆరోపణలు ఉన్నాయి. రాంపల్లి గ్రామంలో నలభై ఎనిమిది కోట్ల విలువ చేసే 24 ఎకరాల 16 గుంటల భూమినీ తమ పేరు మీద రాయించుకున్నాడు ధర్మారెడ్డి. ఈ భూమి పంచాయతీ కీసర rdo కార్యాలయంలో పెండింగ్లో ఉన్నప్పటికీ ధర్మారెడ్డి తో చేతులు కలిపి ఫోర్జారీ డాక్యుమెంట్స్ పై సంతకాలు చేసినట్టు మాజీ ఎమ్మార్వో నాగరాజు పై ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై సెప్టెంబర్లో ధర్మారెడ్డి ని అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు.

Read More: సచివాలయంలో ఏది ఎలా ఉండాలన్నది ఆయన ఆలోచనే.. మంత్రి వేముల ఆసక్తికర వ్యాఖ్యలు

ధర్మారెడ్డి వయసు 80ఏళ్లు. పదిరోజుల క్రితమే బెయిల్ పై జైలు నుంచి విడుదల అయ్యాడు. ఇదే కేసులో ఆయన కుమారు శ్రీధర్ రెడ్డి కూడా అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. అయితే బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం జైల్లోనే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎమ్మార్వో నాగరాజు సైతం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. జైల్లోనే నాగరాజు సూసైడ్ చేసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.