యాప్నగరం

ఎంపీలుగా కేకే, సురేశ్ రెడ్డి.. ఏడింటికి ఏడు టీఆర్ఎస్ ఖాతాలోకి

TRS రాజ్యసభ సభ్యులుగా కే కేశవరావు, కేఆర్ సురేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభకు 7 సీట్లు ఉండగా.. ఏడింటికి ఏడు టీఆర్‌ఎస్ పార్టీ ఖాతాలోకి రావడం విశేషం.

Samayam Telugu 18 Mar 2020, 6:26 pm
టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులుగా కే కేశవరావు, కే ఆర్‌ సురేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయా స్థానాల నుంచి ఎవరూ పోటీ లేకపోవడంతో ఇరువురి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల కమిషన్‌ బుధవారం (మార్చి 18) వెల్లడించింది. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. 16న నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం 3 గంటల వరకు గడువు ఉండగా.. పోటీ అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. తెలంగాణ కోటాలో 7 రాజ్యసభ స్థానాలుండగా.. ప్రస్తుతం ఏడింటికి ఏడు స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోకి రావడం విశేషం.
Samayam Telugu TRS mp


సీనియర్ నేత, మాజీ ఎంపీ కేశవరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.. పెద్దల సభకు ఏకగ్రీవ ఎన్నికడం పట్ల పలువురు మంత్రులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విశేష అనుభవమున్న ఇద్దరు నాయకులు రాజ్యసభలో ఉండటం తెలంగాణకు కలిసొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పరిధిలోని తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ ఎంపీలు


తమిళనాడు నుంచి ఆరుగురు సభ్యులు పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీఎంకే నుంచి త్రిచి శివ, ఎన్‌ఆర్‌ ఎలంగో, అంతియూర్‌ సెల్వరాజ్‌ ఎన్నికవగా.. ఏఐఏడీఎంకే నుంచి కేపీ మునుస్వామి, ఎం.తంబిదురై రాజ్యసభకు ఎన్నికయ్యారు. తమిళ మనీలా కాంగ్రెస్‌ నుంచి జీకే వాసన్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Must Read: కవిత కాన్వాయ్‌లో ప్రమాదం.. నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా..

ఇక ఆ పేరు కూడా ఖరారైతే..!
మరోవైపు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఉత్కంఠ వీడింది. బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఇక గవర్నర్‌ కోటాలో భర్తీ కావాల్సిన ఎమ్మెల్సీ స్థానం ఎంపికపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బుధవారం రాత్రికి ఈ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: హనీమూన్ వెళ్లొచ్చిన యువతికి కరోనా.. ఇంట్లో దాచిన తండ్రిపై కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.