యాప్నగరం

మోదీతో ఢీ.. సీఏఏ రద్దు కోసం.. తెలంగాణ క్యాబినెట్ తీర్మానం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ సహా కొన్ని కీలక నిర్ణయాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. సుమారు 6 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. ఇందులో పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి నిర్వహణపై కీలక చర్చలు జరిగాయి. సీఏఏకు వ్యతిరేక తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు. పూర్తి వివరాలివీ..

Samayam Telugu 17 Feb 2020, 9:00 am
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ సహా కొన్ని కీలక నిర్ణయాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశమైంది. సుమారు 6 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. ఇందులో పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి నిర్వహణపై కీలక చర్చలు జరిగాయి. సీఏఏకు వ్యతిరేక తీర్మానం చేయాలని కూడా నిర్ణయించారు. పూర్తి వివరాలివీ..
Samayam Telugu key decisions got approved in telangana cabinet in pragathi bhavan
మోదీతో ఢీ.. సీఏఏ రద్దు కోసం.. తెలంగాణ క్యాబినెట్ తీర్మానం


పట్టణ ప్రగతిపైనే కీలక చర్చ

ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ఈ నెల 18న ప్రగతి భవన్‌లో రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు నిర్వహించనున్నారు. పట్టణ ప్రగతి నిర్వహణపై కేబినెట్ భేటీ‌లో విస్తృత చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పట్టణాల్లో పచ్చదనం పారిశుద్ధ్యం వెల్లివిరియడమే లక్ష్యంగా కార్యక్రమం సాగాలని సీఎం ఆకాంక్షించారు.

గజ్వేల్ పర్యటన

మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను ఈ సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారందరినీ అదే రోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌ను, స్మశాన వాటికలను సందర్శించడానికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.

సీఏఏ రద్దు తీర్మానం

సీఏఏను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానం చేయాలని నిర్ణయించారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే వ్యతిరేక తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దేశంలో పౌరసత్వం ఇచ్చే విషయంలో మత వివక్ష ఉండకూడదని కేబినెట్ అభిప్రాయపడింది.

ఆర్థిక సంఘం నిధులు

జీహెచ్ఎంసీకి నెలకు రూ.78 కోట్ల చొప్పున, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నెలకు రూ.70 కోట్ల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించి నిధులు జనాభా ప్రాతిపదికన అందించాలి. ఈ విధంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున నిధులు సమకూరతాయి. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు నిధుల కొరత ఉండే అవకాశం లేదు. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్లలో రూ.500 కోట్లు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు, రూ.311 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించేలా నిర్ణయించారు.

ఈ సమావేశాల్లోనే లోకాయుక్త బిల్లు

రాజీవ్ స్వగృహ ఇళ్ళను వేలం ద్వారా అమ్మేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన రామకృష్ణారావు, అరవిందకుమార్ సభ్యులుగా అధికారుల కమిటీని నియమించారు. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హరీశ్, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియాలకు అప్పగించింది. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్సును మంత్రి వర్గం ఆమోదించింది. అసెంబ్లీ బడ్టెట్ సమావేశాల్లో ఈ లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Twitter-TRS in News

Twitter-Telangana CMO

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.