యాప్నగరం

డెంగీ జ్వరం బారిన పడి.. ఖమ్మం మహిళా జడ్జి మృతి

తెలుగు రాష్ట్రాల ప్రజలను డెంగీ జ్వరం భయపెడుతోంది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి బారిన పడి ఖమ్మం మహిళా జడ్జి మరణించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జయమ్మ హాస్పిటల్‌లోనే తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 21 Oct 2019, 3:21 pm
వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాలను డెంగీ, విష జ్వరాలు వణికిస్తున్నాయి. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో విష జ్వరాలు, డెంగీ బారిన పడి లక్షల సంఖ్యలో జనం ఆసుపత్రి పాలవుతున్నారు. సెప్టెంబర్ తొలి వారం నాటికి ఖమ్మం జిల్లాలోనే 1300 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెంగీ జ్వరం కారణంగా ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఎం. జయమ్మ ప్రాణాలు వదిలారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Samayam Telugu judge jayamma.


గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్‌లో ఖమ్మం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. జయమ్మ సొంతూరు మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం అయోధ్యనగర్‌.

డెంగీ కారణంగా జూనియర్ బాలయ్యగా పేరుతెచ్చుకున్న బాల నటుడు సాయి గోకుల్ ఇటీవలే కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ డాక్టర్ కూడా డెంగీ బారిన పడి ప్రాణాలు వదిలారు. దోమ కాటు వల్ల వ్యాపించే డెంగీ కారణంగా.. ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గుతుంది. సకాలంలో చికిత్స అందించడంతోపాటు ప్లేట్‌లెట్స్ కూడా ఎక్కించడం అవసరం. లేని పరిస్థితిల్లో ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.