యాప్నగరం

తెలంగాణకు ఖజానా జ్యువెలరీ భారీ విరాళం.. మంత్రి కేటీఆర్‌కు అందజేత

Coronavirus Telangana: కిషోర్ కుమార్ దాతృత్వం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారమే వృత్తి అయినప్పటికీ, సామాజిక సేవా దృక్పథంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారంటూ కొనియాడారు.

Samayam Telugu 11 Sep 2020, 9:59 pm
బంగారం, వెండి ఆభరణాల వ్యాపారంలో పేరుగాంచిన ఖజానా జ్యువెలర్స్ సంస్థ కరోనా నివారణ చర్యల కోసం తనవంతుగా తెలంగాణ ప్రభుత్వానికి భారీ విరాళం అందించింది. ఖజానా జ్యుయెలర్స్ అధినేత కిషోర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌కు రూ.3 కోట్ల విరాళం తాలూకు చెక్కును శనివారం అందజేశారు. ఈ డబ్బుతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా చికిత్స, కరోనా బాధితుల సంరక్షణ, వైరస్ నిర్మూలన కార్యక్రమాల కోసం వినియోగించాలని కిషోర్ కుమార్ మంత్రి కేటీఆర్‌ను కోరారు.
Samayam Telugu ఖజానా జువెలరీ
Khazana Jewellery


కిషోర్ కుమార్ దాతృత్వం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాపారమే వృత్తి అయినప్పటికీ, సామాజిక సేవా దృక్పథంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారంటూ కొనియాడారు. కరోనా నివారణ చర్యల కోసం భారీ విరాళాన్ని అందజేయడం అభినందనీయమని అన్నారు.

ఈ విరాళం ఇచ్చేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖజానా జ్యుయలర్స్ అధినేతను ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ను కిషోర్ కుమార్ కలిసిన సమయంలో ఎర్రబెల్లి కూడా వెంట ఉన్నారు. కిషోర్ కుమార్ మాట్లాడుతూ, వ్యాపారమే కాకుండా, ప్రజల శ్రేయస్సు కూడా ముఖ్యమేనని ఈ విరాళం ఇస్తున్నామని తెలిపారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.