యాప్నగరం

కిషన్ రెడ్డి భారీ విరాళం.. పీఎం కేర్స్ నిధికి, తెలంగాణకూ..

PM Cares fund: దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలను, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో కరోనా సహాయ కార్యక్రమాలకోసం మరో రూ.50 లక్షలను కూడా ఇస్తున్నట్లు తెలిపారు.

Samayam Telugu 1 Apr 2020, 11:10 pm
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పీఎం-కేర్స్ ప్రత్యేక నిధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి విరాళాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పునరావాస కార్యక్రమాల కోసం ఉద్దేశించిన పీఎం-కేర్స్ ప్రత్యేక నిధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.కోటితోపాటు, తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఆ కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Samayam Telugu kishan reddy


Must Read: కేసీఆర్ సమీక్షకు డిప్యూటీ సీఎంకు నో ఎంట్రీ.. కారణాలేంటంటే..!

దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలను, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో కరోనా సహాయ కార్యక్రమాలకోసం మరో రూ.50 లక్షలను కూడా ఇస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన లేఖలను ఎంపీ లాడ్స్ కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ కలెక్టర్‌లకు పంపించారు.

Must Read: లాక్ డౌన్‌పై తెలంగాణ పోలీసుల పోల్.. షాకింగ్ వాస్తవాలు

ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు తోచినంత మొత్తాన్ని పీఎం-కేర్స్ నిధికి విరాళాల రూపంలో అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.