యాప్నగరం

కిషన్ రెడ్డికి టూరిజం,సాంస్కృతిక శాఖ.. నేడు కేంద్రమంత్రిగా బాధ్యతల స్వీకరణ

మోదీ ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి మొట్టమొదటి కేబినెట్‌ మంత్రిగా తనకు అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాయం చేయడంలో శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు.

Samayam Telugu 8 Jul 2021, 8:04 am
కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌ మరోసారి చోటు దక్కింది. ఈ సారి సహాయ మంత్రిగా కాకుండా కేంద్రమంత్రిగానే కిషన్ రెడ్డికి రెండు శాఖలను కేటాయించారు. కేంద్ర సాంస్కృతిక, టూరిజం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా జి.కిషన్‌రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు టూరిజం మంత్రిగా, ఉదయం 10 గంటలకు సాంస్కృతికశాఖ మంత్రిగా, ఉదయం 10.30 గంటలకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా ఆయా కార్యాలయాల్లో కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
Samayam Telugu కిషన్ రెడ్డి


ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి మొట్టమొదటి కేబినెట్‌ మంత్రిగా తనకు అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తకు అవకాశం దక్కుతుందనడానికి తనకు కేబినెట్‌ పదవి రావడమే ఒక నిదర్శనమని తెలిపారు. హోం మంత్రి అమిత్‌ షాతో కలిసి పనిచేసిన అనుభవం ఎన్నటికీ మర్చి పోలేను. కేంద్ర కేబి నెట్‌ మంత్రిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సాయం చేయడంలో శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావాలి. ఈ వ్యవహారాల్లో తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జంబో క్యాబినెట్‌లో ప్రమోషన్ లభించి కేబినెట్ హోదా దక్కిన విషయం తెలసిందే. బుధవారం జరిగిన విస్తరణలో 15 మంది క్యాబినెట్ మంత్రులుగా, మరో 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో కేంద్ర క్యాబినెట్‌లో మంత్రుల సంఖ్య 78కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.