Kishan Reddy Press Meet Over Coronavirus Along With Bandi Sanjay In Hyderabad
కరోనా అంతానికి కేంద్రం కఠిన చర్యలివే.. కిషన్ రెడ్డి వెల్లడి
కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భాదితుల సంఖ్య రెండు లక్షలు దాటిందని గుర్తు చేశారు. భారత్లో 195 కేసులు నమోదు కాగా.. 5 మంది చనిపోయారని తెలిపారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా 69 వేల మంది హోం క్వారంటైన్లలో ఉన్నారు. కరోనా పరిస్థితులపై పార్లమెంట్లో ఆరోగ్యమంత్రి ప్రకటన కూడా చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో రోజూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు కేబినెట్ సెక్రటరీలతో 22 సమావేశాలు నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం కూడా 16 రివ్యూ మీటింగ్లు నిర్వహించింది. దేశ సరిహద్దులో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించాం. సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులకుపైగా ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్న భారత రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాం.’’
Samayam Telugu20 Mar 2020, 3:42 pm
కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం క్రియాశీలకంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భాదితుల సంఖ్య రెండు లక్షలు దాటిందని గుర్తు చేశారు. భారత్లో 195 కేసులు నమోదు కాగా.. 5 మంది చనిపోయారని తెలిపారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా 69 వేల మంది హోం క్వారంటైన్లలో ఉన్నారు. కరోనా పరిస్థితులపై పార్లమెంట్లో ఆరోగ్యమంత్రి ప్రకటన కూడా చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో రోజూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు కేబినెట్ సెక్రటరీలతో 22 సమావేశాలు నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం కూడా 16 రివ్యూ మీటింగ్లు నిర్వహించింది. దేశ సరిహద్దులో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించాం. సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులకుపైగా ఏర్పాటు చేశాం. విదేశాల్లో ఉన్న భారత రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాం.’’
కొవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే..
‘‘కరోనా బాదితుల గుర్తింపు కోసం ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేశాం. వివిధ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లోని 4,645 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 8 టీంలను ఏర్పాటు చేసింది. విదేశాలలో తీసుకుంటున్న చర్యలను ఇక్కడా అమలు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసులకు సందర్శకులు రావద్దని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటిదాకా ఎయిర్పోర్టుల్లో 14.3 లక్షల మందికి స్ర్కీనింగ్ పరీక్షలు చేశాం. దేశంలో ఆస్పత్రులు సరిపోకపోతే ఆయా ప్రాంతాలలో ఉన్న స్కూళ్లను, కాలేజీలను కూడా వాడుకుంటాం. డబ్ల్యూహెచ్ఓ సహకారాన్ని కూడా కోరాం. 260 మంది నిపుణులకు కరోనా గురించి శిక్షణ ఇచ్చి ఆయా రాష్ట్రాలకు పంపించాం. మార్చి 18 నుంచి విదేశాల నుంచి వచ్చేవారిని కూడా నిషేధించాం. కొవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తాం.’’
‘‘ప్రభుత్వోద్యోగులకు వీక్లీ రోస్టర్ అమలు చేయాలని నిర్ణయించాం. 50 శాతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని నిర్ణయించాం. సాధ్యమైనంత వరకు ప్రైవేటు కంపెనీలు కూడా ఇంటి పని చేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని సూచించాం. ప్రభుత్వ ఆఫీసులలో బయోమెట్రిక్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. ప్రభుత్వ ఉద్యోగుల్లానే.. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగులకు జీతం కత్తిరింపులు లేకుండా అందివ్వాలని కార్మికశాఖ ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. ప్రైవేట్ ఉద్యోగులను ఆఫీసుకు రాకపోతే జీతాలు కట్ చేస్తామని ఎవ్వరూ వేధించొద్దు. అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్ర భాషలలో కరపత్రాలు పంపి ప్రజలలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం.’’
‘‘ఆరోగ్య శాఖకు చెందిన ఏ నిధులనైనా కరోనా కోసం వాడుకోవచ్చు. కరోనా నివారణకు ప్రజలందరూ సహకరించాలి. దీనికి మందు లేదు కాబట్టి రాకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. క్వారంటైన్కు తీసుకువెళ్తుంటే కొందరు ఒప్పుకోవట్లేదు. అందరూ అధికారులకు సహకరించాలి. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలి. ఆదివారం (మార్చి 22) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు తమకు తామే కర్ఫ్యూ విధించుకొని ఇంట్లోనే ఉండాలి. ఆరోజు రోడ్డు మీదకు ఎటువంటి వాహానాలు రాకూడదు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించాలి’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.