యాప్నగరం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్.. ట్విట్టర్‌లో డైలాగ్ వార్..!

Komatireddy Raja Gopal Reddy: తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సోషల్ మీడియా వార్ రోజురోజుకూ ముదురుతోంది. ఇరు పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దీంతో కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఆ ట్వీట్ ఉంది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు చాలా గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇదేనా బీజేపీ సంస్కృతి అంటూ కోమటిరెడ్డికి చురకలు అంటిస్తున్నారు. దీంతో ట్వీట్ వార్ రసవత్తరంగా మారింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 8 Sep 2022, 3:02 pm

ప్రధానాంశాలు:

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్
  • కవితను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి ట్వీట్
  • రాజగోపాల్ రెడ్డి ట్వీట్‌కు టీఆర్ఎస్ శ్రేణుల కౌంటర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Raja Gopal Reddy teets
కవితను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి ట్వీట్
Komatireddy Raja Gopal Reddy: తెలంగాణలో బతుకమ్మ పండగ ఎంతో ఫేమస్. అలాంటి పండగపై ఎవ్వరు కామెంట్ చేసినా.. చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తాయి. అందుకే ఏ పొలిటికల్ పార్టీ లీడర్లు అయినా.. బతుకమ్మ పండగపై కామెంట్స్ చేయడానికి భయపడతారు. కానీ తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వివాదానికి దారితీసింది. ఆయన ట్వీట్ చేసింది రాజకీయ కోణంలోనే అయినా.. అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణ (Telangana)గా మారింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీనిపై ఇప్పటికే బీజేపీ విపరీతంగా ట్రోల్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్‌పై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఈసారి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ (Bathukamma Festival) సంబరాలు ఎక్కడ జరుగుతాయి? ఈడీ ఆఫీసా? సీబీఐ ఆఫీసా లేక తీహార్ జైలా?' అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ ట్వీట్ చేశారు.
ఇదే టీఆర్ఎస్ ఆగ్రహానికి కారణమైంది. తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగను ఇలా అవమానించడమేనా బీజేపీ సిద్ధాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.