యాప్నగరం

టీపీసీసీ చీఫ్ పదవి.. కోమటరెడ్డి పేరు ఖరారు!

Congress Party | తెలంగాణ పీసీసీ చీఫ్ బాధ్యతలను కోమటరెడ్డి వెంకట రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు.

Samayam Telugu 19 May 2020, 4:48 pm
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని సమాచారం. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ ఎప్పుడో రాజీనామా చేసినప్పటికీ.. ఆ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండటం, ఇతర కారణాల వల్ల ఏఐసీసీ ఇప్పటి వరకూ ఆ పదవికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. లాక్‌డౌన్ అయిపోయాక వెంకటరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లాంటి ఇతర నేతలు కూడా ఉన్నారు.
Samayam Telugu కోమటిరెడ్డి


గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ రేసులో ముందజలో ఉన్నారు. అధికార పార్టీపై దూకుడుగా విమర్శలు చేసే రేవంత్‌కు పార్టీ అధిష్టానంలోని పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలంగా మారింది. చంద్రబాబు నాయుడితో సత్సంబంధాలు, ఓటుకు నోటు కేసు కూడా రేవంత్ అభ్యర్థిత్వంపై ప్రభావం చూపాయని తెలుస్తోంది.

అధిష్టానం పిలిచి పగ్గాలు అప్పగిస్తేనే స్వీకరించాలనే ఉద్దేశంలో జీవన్ రెడ్డి ఉన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా గట్టి పోటీని ఇచ్చినప్పటికీ.. విధేయత, మాస్ లీడర్ కావడం, నల్గొండ జిల్లాలో పార్టీకి మంచి పట్టు ఉండటం, రెడ్డి సామాజికవర్గం తదితర కారణాలతో అధిష్టానం వెంకటరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సౌమ్యుడిగా పేరున్న ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డికి ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.