యాప్నగరం

వైసీపీ సీనియర్ నేత కుమారుడితో ఎంపీ కోమటిరెడ్డి కూతురు వివాహం

రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిపిస్తున్నారు.

Samayam Telugu 25 Nov 2020, 1:43 pm
తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు వివాహం రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో ఘనంగా జరిగింది. ఎంపీ కోమటిరెడ్డి తన కుమార్తె శ్రీనిధిని, ఏపీలో వైసీపీకి చెందిన ప్రముఖ సీనియర్ నేత కుమారుడు ప్రణవ్‌తో బుధవారం ఘనంగా జరుగుతోంది. కోవిడ్‌ కారణంగా ఈ వేడుకలో ఇరుకుటుంబాల దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. కర్నూలుకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్‌ రెడ్డి కుమారుడైన ప్రణవ్‌ రెడ్డితో శ్రీనిధికి వివాహం నిశ్చయించారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని లీలాప్యాలెస్‌ వేదికగా వీరిద్దరి కల్యాణం వైభవంగా జరుగుతోంది.
Samayam Telugu కోమటిరెడ్డి కూతురు వివాహం
komatireddy daughter weddiing


Read More: నా ప్రసంగం నచ్చకపోతే వెళ్లిపోతాను.. వెనుతిరిగిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్, ఆ పార్టీకి చెందిన నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాహ సంబంధంతో వీరి మధ్య స్నేహం మరింత ధృడంగా మారబోతుంది. ఇటీవల వారి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ శిల్పా మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలో అతడి సోదరుడి కుమారుడికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.