యాప్నగరం

కాంగ్రెస్ ఆ పని చేసిందంటే బీజేపీలోకి వెళ్లిపోతా.. మాజీ ఎంపీ కుండబద్దలు

Telangana Congress: కొందరు కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ జేబులో మనుషులు అన్న అపవాదు మూటగట్టుకున్నారని కొండా అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో వెనకపడ్డామని చెప్పారు.

Samayam Telugu 5 Dec 2020, 4:06 pm
కాంగ్రెస్ కీలక నేత, టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరతారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పుపై ఆయన గతంలోనే ట్విటర్ వేదికగా ఓ స్పష్టత ఇచ్చారు. పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్‌ను హైదరాబాద్‌లో ఎదుర్కొనేది బీజేపీనే అని ఆ పార్టీ అనుకూల వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా ఈ అంశంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మరోసారి స్పందిస్తూ కాంగ్రెస్‌పై తనకు ఉన్న అసహనాన్ని ప్రకటించారు.
Samayam Telugu కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Konda vishweshwar reddy


శనివారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిస్తే మాత్రం బీజేపీలో చేరతానని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరును కూడా కొండా తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల భాష మారాల్సిన అవసరం ఉందని, మాటకు మాట అన్నట్టుగా వారంతా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అంటూ వారిని కొట్టిపారేశారు.

కొందరు కాంగ్రెస్‌ నేతలు కేసీఆర్‌ జేబులో మనుషులు అన్న అపవాదు మూటగట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో వెనకపడ్డామని చెప్పారు. ఎవరికి పీసీసీ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక మాట మీదకు వచ్చామని తెలిపారు. కేసీఆర్‌కు పదునైన భాషతో బదులు చెప్పే నేతల అవసరం బాగా ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ దగ్గర చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందన్న ఆలోచనల్లో జనం ఉన్నారని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.