యాప్నగరం

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏపీలో తాత చివరి చూపు మిస్.. కేటీఆర్ ట్వీట్ వైరల్

Coronavirus Status in Telangana: హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తాతయ్య చివరి చూపు కోసం కుటుంబంతో సహా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరుతుంటే.. నగరంలో ఎన్నోసార్లు పోలీసులు ఆపి ప్రశ్నించారని ట్వీట్ చేశారు.

Samayam Telugu 26 Mar 2020, 10:52 pm
Samayam Telugu KTR sad.
కరోనా వైరస్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితులు ఎదురైన వారు ఎక్కడికీ వెళ్లలేక కష్టాలు పడుతున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు పౌరుల నుంచి ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు పలు అభ్యర్థనలు వస్తున్నాయి. వాటికి కేటీఆర్ సమాధానమిస్తున్నారు. తన కార్యాలయం నుంచి సాయం పొందొచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఓ యువకుడు చేసిన ఓ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ చలించిపోయారు.

Must Read: పోర్న్ సైట్లకు పెరిగిన గిరాకీ.. అదును చూసి ఆఫర్లు

ఆ యువకుడిది ఏపీలోని కృష్ణా జిల్లా కూచిపూడి. తన సొంతూరిలో అతని తాతయ్య మరణించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తాతయ్య చివరి చూపు కోసం కుటుంబంతో సహా సొంతూరికి వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరుతుంటే.. నగరంలో ఎన్నోసార్లు పోలీసులు ఆపి ప్రశ్నించారని ట్వీట్ చేశారు. ప్యారడైజ్ వద్ద పోలీసులు మాత్రం కనీసం మానవత్వం లేకుండా మాట్లాడారని గోడు వెళ్లబోసుకున్నాడు. వాళ్లు ఆపేయడంతో తన తాతయ్య చివరి చూపునకు కూడా వెళ్లలేకపోయామని చెప్పారు.

Must Read: కరోనా కష్టాలు అప్పటివరకూ తప్పవా.. పంచాంగంలో ఏముందంటే..

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణం తన కార్యాలయ సిబ్బంది సంప్రదించి సాయం చేస్తారని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

Also Read: చీపురు పట్టి వంటిల్లు శుభ్రం చేస్తున్న మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ చీఫ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.