యాప్నగరం

కేటీఆర్‌కు చేదు అనుభవం.. కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు

Sircilla: తమ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 9 Dec 2020, 4:13 pm
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆ‌ర్‌కు నిరసన సెగ ఎదురైంది. ఎల్లారెడ్డి పేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించేందుకు, ఓ కార్యకర్త పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. డిగ్రీ కళాశాల కావాలంటూ వారు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలందర్నీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగారు. బీజేపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వారిపై దాడికి దిగారు. నలుగురు బీజేపీ కార్యకర్తలపై దాడిచేసి, వారి ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సాయికుమార్ అనే బీజేపీ కార్యకర్త గాయపడ్డారు. ఇరువర్గాల ఆందోళనలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Samayam Telugu కేటీఆర్
KTR


తమ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి దాడికి పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. పార్టీకి సంబంధం లేని మైనార్టీ యువకుడిపై మంత్రి సమక్షంలోనే టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని, దాడికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆందోళనను విరమింపజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.