యాప్నగరం

వరద ప్రాంతాల్లో 40 శిబిరాలు.. 80 వేల మందికి ఉచిత భోజనం: కేటీఆర్‌

TS Assembly: ప్రమాదకర ప్రదేశాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాత బస్తీలో అభ్యంతరకర భవనాల్లో ఉంటున్న వారికి కొంతమందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.

Samayam Telugu 14 Oct 2020, 4:50 pm

హైదరాబాద్‌లో భారీ వర్షాలు పోటెత్తుతున్న సమయంలో సహాయక చర్యలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నగరంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ రాత్రి 12 గంటల వరకు సమీక్షించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రేటర్‌లో డీఆర్ఎఫ్ వ్యవస్థ ఉందని చెప్పారు. వరద ప్రాంతాల్లో దాదాపు 40 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని.. అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 80 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అంటు వ్యాధులు సైతం ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ వెల్లడించారు.
Samayam Telugu కేటీఆర్ (ఫైల్ ఫోటో)
ktr


ప్రమాదకర ప్రదేశాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాత బస్తీలో అభ్యంతరకర భవనాల్లో ఉంటున్న వారికి కొంతమందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. భవనాలు ఖాళీ చేయని వారిని బలవంతంగానైనా చేయిస్తామన్నారు. సీనియర్ ఐఏఎస్‌లు, మేయర్, డిప్యూటీ మేయర్ జోన్ల పర్యవేక్షణలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ గేట్లను తెరిచామని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం వరదలపై హైఅలెర్ట్‌గా ఉందన్నారు. అపార్ట్‌మెంట్‌లు, సెల్లార్ల వద్ద తగు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ వెల్లడించారు.

Don't Miss: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.