యాప్నగరం

కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ.. కీలక ప్రాజెక్టులపై వినతి

ఢిల్లీ పర్యటనలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. క్రిసిల్ ఇండియా నిర్వహించిన ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్ 2019’ సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులతో వరసగా భేటీ అయ్యారు. మంత్రి స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి సాయం అందించాల్సిందిగా కోరారు.

Samayam Telugu 26 Nov 2019, 7:53 pm
ఢిల్లీ పర్యటనలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. క్రిసిల్ ఇండియా నిర్వహించిన ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్ 2019’ సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులతో వరసగా భేటీ అయ్యారు. మంత్రి స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్రం నుంచి సాయం అందించాల్సిందిగా కోరారు.
Samayam Telugu ktr meets central minister smriti irani and prakash javadekar in delhi
కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ.. కీలక ప్రాజెక్టులపై వినతి


కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌పై వినతి..

కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో కేటీఆర్ భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు సహకారం అందించాల్సిందిగా మంత్రిని కోరారు. సిరిసిల్లలో సీపీసీడీఎస్ పథకం కింద మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని మంత్రి స్మృతి ఇరానీని కేటీఆర్ కోరారు. నేత కార్మికులు నేసిన చీరను మంత్రికి బహూకరించి సత్కరించారు.

ఫార్మా సిటీకి సాయం అందించండి..

అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీ అభివృద్ధి గురంచి ఆయనతో ప్రత్యేకంగా చర్చించారు. కేంద్రం నుంచి సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించారు.

Also Read: ఆర్టీసీ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష

Twitter-Met with Hon’ble Union Environment & Forest Minist...

క్రిసిల్ ఇండియా సదస్సులో కీలక ప్రసంగం..

దేశ రాజధానిలో క్రిసిల్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంక్లేవ్ 2019’లో సదస్సులో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఈ సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, ఆయా రంగాల నిపుణులు పాల్గొన్నారు.

చొరవ తీసుకోండి.. ఎంపీలకు సూచన

పార్లమెంట్ భవనంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో రాష్టానికి చెందిన ఎంపీలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకురావడంలో ఎంపీలందరూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Twitter-IT and Industries Minister @KTRTRS delivered a key...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.