యాప్నగరం

‘ఆరోగ్య హైదరాబాద్’ లక్ష్యంగా కేటీఆర్ సమీక్ష.. పలు కీలక ఆదేశాలు

Green Hyderabad: నగరంలో పచ్చదనం పెంపు, పార్కులు, మైదానాల అభివృద్ధి, టాయిలెట్లు, ఎఫ్‌ఓబీలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అంశాలపై ఈ సమీక్ష సాగింది. ప్రజలు ఆరోగ్యం కోసం ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Samayam Telugu 2 Feb 2020, 11:03 am
రైట్‌ టు వాక్‌ నినాదంలో భాగంగా హైదరాబాద్‌లో రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లు నిర్మించాలని, ఆక్రమణలు అరికట్టి వెండింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పాఠశాలల వద్ద, ఫుట్‌పాత్‌లపై రెయిలింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధాన జంక్షన్లలో వాహనాలు ఫ్రీ లెఫ్ట్‌ తీసుకొనేందుకు వీలుగా బారీ కేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో పచ్చదనం పెంపు, పార్కులు, మైదానాల అభివృద్ధి, టాయిలెట్లు, ఎఫ్‌ఓబీలు, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర అంశాలపై ఈ సమీక్ష సాగింది. ప్రజలు ఆరోగ్యం కోసం ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు.
Samayam Telugu EPssgI3U8AIkAXs.
V Srinivas Goud/Twitter


Also Read: కేంద్ర బడ్జెట్: నిర్మల నోట ఉర్దూ కవిత.. తెలుగు అర్థం ఇదే..

సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా నగరంలో పచ్చదనం పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అర్బన్‌ ఆర్ట్స్‌ ఫోరం లేదా కౌన్సిల్‌లను నెలకొల్పనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. అనువైన స్థలం ఉంటే పచ్చదనం పెంపునకు మియావాకి ప్లాంటేషన్‌ చేపట్టాలని సూచించారు. వంతెనల కింద పచ్చదనం నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు. పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనుల్లో సలహాలు, సూచనల కోసం నగరంలో ఉన్న 40 మంది ఆర్కిటెక్చర్‌ డిజైనర్లతో ప్రత్యేకంగా చర్చించాలని సూచించారు.

Also Read: బడ్జెట్ ప్రసంగంలో మంత్రి సీతారామన్ అరుదైన రికార్డు

పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి అనువుగా ఉన్న పార్కులను గుర్తించాలని, రెండు నెలల్లో ప్రతి జోన్‌లో 500 టాయిలెట్లు నిర్మించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో నగరంలోని 1,100 మైదానాల్లో విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, షెటిల్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి జోన్‌లో ఉన్న పార్కులు, ఆట స్థలాల్లో పది కిలో మీటర్ల మేరు సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ‘కొద్ది కాలం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయకండి’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.