యాప్నగరం

లాక్‌డౌన్‌లోనూ ఆన్‌లైన్ ఆర్డర్లు.. హోం డెలివరీ! ఎలాగంటే.. కేటీఆర్ ట్వీట్

Home Delivery: ఇక్కడ లాక్‌డౌన్ విధించగా, అన్ని రకాల ఈ-కామర్స్ సైట్లు సైతం హోం డెలివరీలను ఆపేశాయి. ఫలితంగా ప్రజలు తమకు కావాల్సిన సరుకుల కోసం నేరుగా దుకాణాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.

Samayam Telugu 25 Mar 2020, 9:33 am
దేశంలో రాబోయే 21 రోజుల వరకూ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకూ ఎవరూ తమ ఇంటి గడప దాటేందుకు వీల్లేదని మంగళవారం ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దుకాణాలకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి నిర్ణయమే ఇటలీ లాంటి దేశాలు తీసుకున్నప్పుడు అక్కడి ప్రజలంతా ఆన్‌లైన్ సైట్ల ద్వారానే ఆహార పదార్థాలు, నిత్యావసరాలు, మందులు అన్నీ కొనుగోలు చేశారు. కానీ, ఇక్కడ లాక్‌డౌన్ విధించగా, అన్ని రకాల ఈ-కామర్స్ సైట్లు సైతం హోం డెలివరీలను ఆపేశాయి. ఫలితంగా ప్రజలు తమకు కావాల్సిన సరుకుల కోసం నేరుగా దుకాణాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.
Samayam Telugu KTR-2


Also Read: ప్లీజ్.. ఇంటి ఓనర్లు అద్దె అడగొద్దు, సీఎం విజ్ఞప్తి

ఈ వ్యవహారంపై స్పందించిన ఓ నెటిజన్.. ఓ ప్రశ్నను సంధిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కి ట్వీట్ చేశారు. దానిపై స్పందించిన కేటీఆర్ స్పందించారు. లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నిత్యావసరాలను ఇంటికి చేరవేయడంలో పేరెన్నికగన్న ప్రముఖ హోండెలివరీ సంస్థలు బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చేయాలని ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ఆదేశించినట్లు తెలిపారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, ఒకట్రెండు రోజుల్లో ఆన్‌లైన్‌లోనే నిత్యవసరాలు కొనుక్కునే అవకాశం రావొచ్చని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Must Read: ధరలు పెంచితే జైలుకే, 6 దాటితే అంతే.. పీడీయాక్ట్, ఏడ్చినా వదలం: కేసీఆర్


Must Read: లాక్‌డౌన్‌పై కేటీఆర్ ట్వీట్ వైరల్.. ఆలోచింపజేస్తున్న డాక్టర్ వీడియో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.