యాప్నగరం

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్... లింక్ రోడ్లు ప్రారంభించనున్న కేటీఆర్

ఇవాళ ఉదయం భాగ్యనగరంలో కేటీఆర్ పర్యటించనున్నారు. పదిన్నర గంటలకు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

Samayam Telugu 9 Nov 2020, 8:39 am
హైదరాబాద్‌లో ఇవాళ పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. నగరంలో చేపట్టిన పలు అభివృద్దిపనులను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా లింక్ రోడ్ల నిర్మాణాలను చేపట్టింది ప్రభుత్వం. దీంతో పూర్తయిన రహదారులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10.30 గంటలకు నందిహిల్స్ లింక్‌రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
Samayam Telugu మంత్రి కేటీఆర్
minister ktr


Read More: వణికిస్తున్న చలి.. భారీగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి పాత ముంబై రోడ్డు లెదర్ పార్క్ వరకు నిర్మించిన రోడ్డును జాతికి అంకితం చేయనున్నారు మంత్రి. అదేవిధంగా 10.45 గంటలకు లెదర్ పార్కును కూడా ప్రారంభించనున్నారు. లెదర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ చేపట్టిన వీయూసీ వంతెన పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పాత ముంబై హైవే నుంచి ఖాజాగూడ వరకు లింక్‌రోడ్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11.45 గంటలకు మియాపూర్‌, నిజాంపేట మధ్య లింక్ రోడ్డను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ లింక్‌రోడ్ల ప్రారంభంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. కొత్త రోడ్లు ప్రారంభం పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా కాస్త తీరుతుందని చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.