యాప్నగరం

వరద సాయం: బాధితులపై విరుచుకుపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వెళ్లిపోండి అంటూ వార్నింగ్

Kukatpally: హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. బల్దియా ఎన్నికల ప్రచారం వల్ల ఆ పంపిణీ ఆగిపోయింది.

Samayam Telugu 9 Dec 2020, 2:52 pm
వరద బాధితులకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్ ఇచ్చారు. వరద బాధితులైన మహిళలు వరద సహాయం కోసం అడగడానికి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళితే ఆయన బాధితులపై మండిపడ్డారు. దీంతో బాధితులు కంగుతిన్నారు. ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా బాధితులపై విరుచుకు పడ్డాడు. దీంతో బాధితులు ఎమ్మెల్యే మాటలకు బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Samayam Telugu స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
madhavaram krishna rao


‘‘వరద సాయం మీకు రాదు. నిరుపేదలకు గరీబోళ్లకే వస్తుంది. మీకు ఇప్పుడు రాదు. మళ్లీ ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుంటే అప్పుడు వస్తది. ఇప్పుడు మీకేం రాదు. మీరు వెళ్లిపోండి. ఏం తమాషా చేస్తున్నారా? మా ఇంట్లో నుండి వెళ్లిపోండి’’ అంటూ ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లను గెలిపిస్తే ఇస్తామన్నారు కదా అని బాధితులు గుర్తు చేయగా ఎమ్మెల్యే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మీకు రావు ఏం చేసుకుంటారో చేసుకోండి అని తేల్చి చెప్పారు.

హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. బల్దియా ఎన్నికల ప్రచారం వల్ల ఆ పంపిణీ ఆగిపోయింది. మళ్లీ డిసెంబరు 7 నుంచి పంపిణీ మొదలవుతుందని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియం వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో వరద బాధితులు పరిహారం కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లగా ఆయన ప్రవర్తనతో వారు నిరాశతో వెనుదిరిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.