యాప్నగరం

ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీకి ప్రతిష్ఠాత్మక అవార్డు

Hyderabad: ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు కేవీబీ రెడ్డి కన్‌స్ట్రక్షన్ వరల్డ్‌తోపాటు జ్యూరీకి కృతజ్ణతలు తెలిపారు. ఈ ఏడాది అవార్డు విజేతలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.

Samayam Telugu 21 Oct 2020, 8:49 pm
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికి గాను కేవీబీ రెడ్డికి కన్‌స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గ్లోబల్ అవార్డు వరించింది. ప్రైవేట్ రంగానికి సంబంధించి ఆయన ఈ అవార్డును దక్కించుకున్నారు. వర్చువల్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. నిర్మాణ రంగం, వ్యాపారంలో చెప్పుకోదగ్గ విజయాలు అందుకున్న వారికి ఈ అవార్డు ఇస్తారు.
Samayam Telugu కేవీబీ రెడ్డి
kvb reddy


ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు కేవీబీ రెడ్డి కన్‌స్ట్రక్షన్ వరల్డ్‌తోపాటు జ్యూరీకి కృతజ్ణతలు తెలిపారు. ఈ ఏడాది అవార్డు విజేతలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. కేవీబీ రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.