యాప్నగరం

లలితా జువెలర్స్ ఉదారత.. తెలంగాణకు భారీ విరాళం

Lalitha Jewellers: సీఎం కేసీఆర్‌కు లలిత జ్యువెల్లర్స్ సీఎండీ కిరణ్ కుమార్ దీనికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా ఆయన చెరో రూ.కోటి విరాళాన్ని కిరణ్ కుమార్ అందించారు.

Samayam Telugu 6 May 2020, 6:41 pm
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు ఉదారత చూపుతున్నారు. పీఎం, సీఎం సహాయ నిధులకు విరాళాలను అందిస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ వ్యాపార వేత్త తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాన్ని అందించారు. ‘డబ్బులెవరికీ ఊరికే రావు’ అంటూ వాణిజ్య ప్రకటనల్లో తరచూ కనిపించే లలితా జువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ఉదారత చాటారు. తెలంగాణ సీఎం సహాయనిధికి లలితా జ్యువెల్లర్స్ రూ.కోటి విరాళం అందించింది. సీఎం కేసీఆర్‌కు లలిత జ్యువెల్లర్స్ సీఎండీ కిరణ్ కుమార్ దీనికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా ఆయన చెరో రూ.కోటి విరాళాన్ని కిరణ్ కుమార్ అందించారు.
Samayam Telugu సీఎంకు చెక్కు అందిస్తున్న లలితా జువెలర్స్ అధినేత


Also Read: undefined

కరోనా వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా సింగరేణి గనుల యాజమాన్యం కూడా అండగా నిలిచిందది. ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అందించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.