యాప్నగరం

నల్గొండలో రెండు వర్గాల తీవ్ర ఘర్షణ.. రాళ్లు, కర్రలతో బాదుకొని ఆస్పత్రిపాలు

Nalgonda: స్థానికులు ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగకుండా పరస్పరం కర్రలతో, రాళ్లతో దాడి చేసుకోవడంతో ఐదుగురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి.

Samayam Telugu 14 May 2020, 9:07 pm
నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో ఇరు వర్గాల మధ్య తగాదా తీవ్రమైన ఘర్షణకు దారి తీసింది. దామరచర్ల మండలంలోని వీర్లపాలెంలో రెండు వర్గాల మధ్య భూవివాదం సమస్య ఉంది. గురువారం సాయంత్రం సమయంలో ఈ భూ వివాదం విషయంపై రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా.. మాట మాట పెరిగింది. క్రమంగా ఇది ఘర్షణకు దారి తీసి, ఏకంగా కర్రలతో, రాళ్ళతో కొట్టుకొనే వరకూ వెళ్లింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఇరు వర్గాలు రెచ్చిపోయి మూకుమ్మడిగా ఒకరిపై మరొకరు యుద్ధాన్ని తలపించేలా దాడి చేసుకున్నారు. స్థానికులు ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆగకుండా పరస్పరం కర్రలతో, రాళ్లతో దాడి చేసుకోవడంతో ఐదుగురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని స్థానికులు మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.