యాప్నగరం

టీఆర్ఎస్ మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. భార్యాపిల్లలకు కూడా..

LB Nagar: కరోనా మహమ్మారి ప్రభావంతో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు కూడా ప్రభావితం అవుతున్నారు. ఇటీవలే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వల్ల చనిపోయారు.

Samayam Telugu 8 Aug 2020, 3:19 pm
తెలంగాణలో టీఆర్ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తాజాగా హైదరాబాద్‌ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అంతేకాక, ఆయన ఆయన భార్య పిల్లలకు కూడా కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు కరోనా సంక్రమించిన వారి జాబితాలో ఉన్నారు.
Samayam Telugu సుధీర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
LB Nagar MLA Sudheer reddy tested for corona positive


కరోనా మహమ్మారి ప్రభావంతో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు కూడా ప్రభావితం అవుతున్నారు. ఇటీవలే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనా వల్ల చనిపోయారు. శనివారం కాంగ్రెస్ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కూడా కరోనా కాటుకు చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ నిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు.

మరోవైపు, శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రంలో 2,256 కొత్త కేసులను గుర్తించారు. ఈ వారం ఆరంభంలో కరోనా కేసుల సంఖ్య తగ్గగా.. నాలుగు రోజుల నుంచి రోజుకు 2 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కోవిడ్ బారిన పడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 615కు చేరింది. 24 గంటల్లో 1091 మంది కరోనా నుంచి కోలుకోగా.. వారి మొత్తం సంఖ్య 54,330కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.